Malaysia Masters: మలేషియా మాస్టర్స్లో చరిత్ర సృష్టించిన ప్రణయ్
మలేసియా మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
Malaysia Masters 2023: మలేసియా మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) అదరగొట్టాడు. తొలి వరల్డ్ టూర్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ సాగింది. మొదటి గేమ్ నుంచే ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు షట్లర్లు చమటోడ్చారు. చివరకు 21-19, 13-21, 21-18తో ప్రణయ్ విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు ప్రైజ్మనీ అందుకున్నాడు. దీంతో మలేషియా మాస్టర్స్ పురుషుల సింగిల్స్లో టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా హెచ్ఎస్ ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
🥇🇮🇳 THE GIANT SLAYER! Prannoy HS brings home the gold after an intense battle against Weng Hong Yang of China at the Malaysia Masters 2023.
🎉 Congratulations, Prannoy!
📷 BFW• #MalaysiaMasters2023 #IndiaontheRise #Badminton #BharatArmy pic.twitter.com/DYJ1XCMGop
— The Bharat Army (@thebharatarmy) May 28, 2023
నిరాశపరిచిన శ్రీకాంత్, సింధు
ఇదే టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు, శ్రీకాంత్లు నిరాశ పరిచారు. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. కాగా.. సింధు పతకంపై ఆశలు రేపింది. అయితే.. సెమీ ఫైనల్లో ఆమె ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన జార్జియా మరిస్కా తుంజంగ్ చేతిలో 14-21,17-21 తో ఓడిపోయింది.