Ind Vs WI : భారత్ ఓటమి, టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం
విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ హాఫ్ సంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. Ind Vs WI 5th T20I
![Ind Vs WI : భారత్ ఓటమి, టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం Ind Vs WI : భారత్ ఓటమి, టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం](https://10tv.in/wp-content/uploads/2023/08/Ind-Vs-WI-5th-T20I.jpg)
Ind Vs WI 5th T20I
Ind Vs WI 5th T20I : వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో విండీస్ అదరగొట్టింది. తొలుత బౌలింగ్ లో చెలరేగింది. ఆ తర్వాత బ్యాటర్లు కూడా రాణించారు. దాంతో భారత్ పై ఘన విజయం సాధించింది.
టీమిండియా నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్.. 18 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విండీస్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. దాంతో 8 వికెట్ల తేడాతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది.
విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండన్ కింగ్ హాఫ్ సంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నికోలస్ పూరన్ (47), హోప్ (22) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో 3-2 తేడాతో టీ20 సిరీస్ ను విండీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది.