IPL 2021 PBKS Vs CSK : పంజాబ్ టార్గెట్ 135

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బౌలర్లు రాణించారు. చెన్నై జట్టు

IPL 2021 PBKS Vs CSK : పంజాబ్ టార్గెట్ 135

Punjab Kings Vs Chennai Super Kings

IPL 2021 PBKS Vs CSK : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ బౌలర్లు రాణించారు. చెన్నై జట్టుని కట్టడి చేశారు. సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

చెన్నై ఓపెనర్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో రాణించాడు. డుప్లెసిస్ ఒంటరి పోరాటం(55 బంతుల్లో 76 పరుగులు) చేశాడు. అతడికి రవీంద్ర జడేజా(17 బంతుల్లో 16 పరుగులు) చక్కని సహకారం అందించాడు. మిగతా వాళ్లంతా విఫలం అయ్యారు. ఈ జోడీ కారణంగానే చెన్నై జట్టు ఆ మాత్రం పరుగులు అయినా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, షమీ తలో వికెట్ తీశారు.

Brinjal : వంకాయ క్యాన్సర్ ని అడ్డుకుంటుందా?

ఐపీఎల్‌ 14వ సీజన్‌ లో ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరగా పంజాబ్‌ సాంకేతికంగా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. ఇలా అయితే ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసంభవమే.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లే ముందు విజయం సాధించి గాడిలో పడాలని చూస్తోంది.

ధోనీసేనదే ఆధిపత్యం..
ఇప్పటివరకు చెన్నై, పంజాబ్‌ జట్ల మధ్య మొత్తంగా 25 మ్యాచులు జరగ్గా ధోనీసేన 16 విజయాలతో ఆధిపత్యం చెలాయిస్తోంది. పంజాబ్‌ 9 మ్యాచులే గెలుపొందింది. ఇంతకుముందు ఇదే దుబాయ్‌ స్టేడియంలో తలపడిన సందర్భంలోనూ చెన్నైదే పైచేయి. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ధోనీసేన నాలుగు విజయాలతో దూకుడును కొనసాగించింది. ఇక ఈ సీజన్‌లో భారత్‌లో ఆడిన తొలి దశలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ఎలా చూసినా రాహుల్‌ టీమ్‌పై ధోనీసేనదే పైచేయి.

Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..

పంజాబ్‌కు ఇదొక్కటే సానుకూలం..
అందరికన్నా ముందే అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. తొలుత రాజస్థాన్‌, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ చెన్నైని ఓడించి షాక్ ఇచ్చాయి. దీంతో ప్లేఆఫ్స్‌ చేరేముందు ధోనీసేనకు రెండు గట్టి దెబ్బలు తగిలాయి. దీంతో నేటి మ్యాచ్‌లో పంజాబ్‌కు ఏదైనా సానుకూలాంశం ఉందంటే అది ఇదొక్కటే. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలుపొంది మరొకటి ఓటమిపాలైంది. ఇది కూడా అటు ఇటుగానే కనిపిస్తోంది. రెండో దశలో అనూహ్యంగా ఆడుతున్న కోల్‌కతాను గత శుక్రవారం ఓడించిన రాహుల్‌ టీమ్‌ ఆదివారం బెంగళూరు చేతిలో మరోసారి విజయానికి చేరువై ఓటమిపాలైంది.

ఈ ఆటగాళ్లే కీలకం..
చెన్నై జట్టులో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఢిల్లీతో గత మ్యాచ్‌లో రాణించలేకపోయినా ఈ సీజన్‌లో టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. మరోవైపు డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో చెన్నై బ్యాటింగ్‌ విభాగం ఫర్వాలేదనె చెప్పాలి.

ఇక బౌలింగ్‌లో శార్దూల్‌, బ్రావో, దీపక్‌ చాహర్‌ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. ఏ జట్టునైనా నిలువరించే సత్తా వీరికి ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరోవైపు పంజాబ్‌ జట్టులో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మినహా బ్యాటింగ్‌లో ఎవరూ రాణించడం లేదు. బౌలింగ్‌లో షమి, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. రెండు జట్లను కంపేర్ చేస్తే సీఎస్కే బలంగా కనిపిస్తోంది.