కీలక పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
భారత్-కివీస్ల హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్లోనే అతి పెద్దదైన ఈడెన్ పార్క్ స్టేడియంలో రెండో టీ20ఆడేందుకు ఇరు జట్లు సమాయత్తమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కుంచుకున్న భారత్.. టీ20ల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించింది. అయితే మూడు మ్యాచ్ల ఫార్మాట్లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఘోర పరాజయం పాలైన భారత్కు ఈ మ్యాచ్ కీలకం. ఆఖరి రెండు మ్యాచ్లు గెలిస్తేనే సిరీస్ చేజిక్కుతుంది. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ జట్టును ఓడించడం చాలా కష్టంతో కూడుకున్న పనే.
తొలి టీ20లో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్ పుంజుకుంటనే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో కూడా లోపాలను సరిచేసుకోలేకపోతే సిరీస్ ఆశలు వదిలేసుకోవాల్సిందే.
తుది జట్టు వివరాలిలా:
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా,యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్,
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్రాండ్ హోమ్, ఫెర్గ్యూసన్, మిచెల్, మిచెల్ శాంతర్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సౌధీ, టిమ్ సౌథీ, కొలిన్ మన్రో, రోస్ టేలర్, కగ్లీజెన్
New Zealand win the toss and elect to bat first in the 2nd T20I. pic.twitter.com/kME8d034VG
— BCCI (@BCCI) February 8, 2019