కీలక పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

కీలక పోరు: టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న కివీస్

భారత్-కివీస్‌ల హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్‌లోనే అతి పెద్దదైన ఈడెన్ పార్క్ స్టేడియంలో రెండో టీ20ఆడేందుకు ఇరు జట్లు సమాయత్తమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కుంచుకున్న భారత్.. టీ20ల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించింది. అయితే మూడు మ్యాచ్‌ల ఫార్మాట్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఘోర పరాజయం పాలైన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం. ఆఖరి రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే సిరీస్ చేజిక్కుతుంది.  ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించడం చాలా కష్టంతో కూడుకున్న పనే. 

తొలి టీ20లో అన్ని విభాగాల్లో విఫలమైన భారత్ పుంజుకుంటనే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా లోపాలను సరిచేసుకోలేకపోతే సిరీస్ ఆశలు వదిలేసుకోవాల్సిందే.  

తుది జట్టు వివరాలిలా:

భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా,యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, 

న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్రాండ్ హోమ్, ఫెర్గ్యూసన్, మిచెల్, మిచెల్ శాంతర్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సౌధీ, టిమ్ సౌథీ, కొలిన్ మన్రో, రోస్ టేలర్, కగ్లీజెన్