మహిళల తొలి పోరు, మంధానకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఉమన్స్ టీ20 చాలెంజ్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన ట్రయల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్నోవాస్ మే6న ముగిసింది. ఐపీఎల్ 2019కు మధ్యలో షెడ్యూల్ ప్లాన్ చేసిన బీసీసీఐ తొలి మ్యాచ్ను నిర్వహించింది. ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీతి కెప్టెన్సీ వహిస్తున్న సూపర్ నోవాస్ను స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ 2పరుగులు తేడాతో ఓడించింది.
ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ముగిసిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మంధాననే వరించింది. 67బంతుల్లో 90పరుగులు; 10ఫోర్లు, 3సిక్సులతో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్టు సూపర్నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(46; 34 బంతుల్లో 8ఫోర్లు)ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.