Google Pixel Tablet : టెన్సర్ G2తో గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ వస్తోంది.. 2023లో ఎప్పుడైనా రావొచ్చు!
Google Pixel Tablet : Google వార్షిక I/O ఈవెంట్లో కొత్త ప్రొడక్టుల గ్రూపును ప్రారంభించింది. పిక్సెల్ టాబ్లెట్ కంపెనీకి మొదటి ప్రొడక్ట్. సెర్చ్ దిగ్గజం మొదటిసారిగా స్మార్ట్వాచ్ను, కొత్త పిక్సెల్ 7 సిరీస్ను కూడా ప్రకటించింది.
Google Pixel Tablet : Google వార్షిక I/O ఈవెంట్లో కొత్త ప్రొడక్టుల గ్రూపును ప్రారంభించింది. పిక్సెల్ టాబ్లెట్ కంపెనీకి మొదటి ప్రొడక్ట్. సెర్చ్ దిగ్గజం మొదటిసారిగా స్మార్ట్వాచ్ను, కొత్త పిక్సెల్ 7 సిరీస్ను కూడా ప్రకటించింది. Google నుంచి లేటెస్టును టాబ్లెట్ను చూశామన్నారు.
Google Pixel టాబ్లెట్ కంపెనీ హోమ్-బ్రూడ్ Tensor G2 ప్రాసెసర్ నుంచి కొత్తగా Pixel 7, Pixel 7 Pro స్మార్ట్ఫోన్లకు కూడా అందిస్తోంది. ఈ ఇంటర్ఫేస్ Google మెటీరియల్ డిజైన్పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ Android 12OSతో పనిచేస్తుంది. టాబ్లెట్ అల్యూమినియం బాడీతో వస్తుంది.
నానో-సిరామిక్ కోటింగ్ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. పిక్సెల్ టాబ్లెట్ Android 12L ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. పెద్ద స్క్రీన్పై మెరుగైన కంటెంట్ వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం ఫీచర్ అందిస్తోంది. అప్డేట్ చేసిన టాస్క్బార్ మెరుగైన మల్టీ టాస్కింగ్ సపోర్ట్ ఉన్నాయి. గూగుల్ వైర్లెస్ ఛార్జింగ్ డాక్ను కూడా ప్రదర్శించింది. కొత్త పిక్సెల్ టాబ్లెట్ను స్మార్ట్ డిస్ప్లేగా మార్చవచ్చు. మిగిలిన వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు.
భారత మార్కెట్లోకి కూడా వస్తుందో లేదో గూగుల్ ఇంకా ధృవీకరించలేదు. కంపెనీ ఇప్పుడే భారత్లో పిక్సెల్ 7 సిరీస్ను ప్రారంభించింది. దీని ధర రూ. 59,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త 5G ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్కార్ట్ ద్వారా ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..