Two People Raped Girl : బాలికపై కొంతకాలంగా ఇద్దరు అత్యాచారం.. మగబిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

హైదరాబాద్ లో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడగా, ప్రేమ పేరుతో లోబర్చుకున్న మరో దుర్మార్గుడు బాలికపై లైంగిక దాడి చేశాడు. వారి దాష్టీకంతో గర్భం దాల్చిన బాలిక శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది.

Two People Raped Girl : బాలికపై కొంతకాలంగా ఇద్దరు అత్యాచారం.. మగబిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

two people raped girl

Two People Raped Girl : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడగా, ప్రేమ పేరుతో లోబర్చుకున్న మరో దుర్మార్గుడు బాలికపై లైంగిక దాడి చేశాడు. వారి దాష్టీకంతో గర్భం దాల్చిన బాలిక శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇటీవలే జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. బాలికకు పుట్టిన బాబుకు 3 నెలల వయస్సు దాటిన తర్వాత డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటగిరిలో నివాసముంటున్న బాలిక (16) తల్లితో పాటు ఇళ్లల్లో పనిచేస్తుంటుంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న సాయికుమార్‌(25) బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక పని చేస్తున్న ఇంటి పక్కన వాచ్‌మన్‌గా పని చేస్తున్న నేపాల్‌కు చెందిన బుద్దిమాన్‌ కామే(53) అనే మరో వ్యక్తి బాలికతో మాటలు కలిపి గదిలోకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. వాటిని తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Hyderabad: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఘాతుకం

అలాగే, సాయికుమార్‌ అనే వ్యక్తి సైతం బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. సుమారు ఆరు నెలల గర్భంతో కనిపించిన బాలికను గుర్తించిన ఆశ వర్కర్లు.. ఈ సమాచారాన్ని చైల్డ్‌వెల్ఫేర్‌ అధికారులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఈ వ్యవహారం జూబ్లీహిల్స్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిని గతనెలలో పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

అప్పటినుంచి బాధితురాలు స్టేట్‌హోమ్‌లో ఉంది. బాధిత బాలిక శనివారం నిలోఫర్‌ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక గర్భం దాల్చేందుకు కారణం ఎవరనే విషయాన్ని తేల్చేందుకు నిందితులిద్దరితో పాటు పుట్టిన బాబుకు సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.