Bandi Sanjay : మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలి : బండి సంజయ్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay : మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలి : బండి సంజయ్ డిమాండ్

TSPS Question Paper leack

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay). టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ప్రతిభగల విద్యార్ధుల జీవితాలు నాశనం అవుతున్నాయని.. అన్ని విషయాలను ఊకదంపుడుగా మాట్లాడే కేసీఆర్ టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడటంలేదు? అంటూ ప్రశ్నించారు.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్ధుల జీవితాలను నాశమయ్యాయని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలేదేలేదని దీని వెనుక ఎవ్వరు ఉన్నా వదలమని.. విద్యార్ధుల జీవితాలు నాశనం చేసినవారికి తగిన బుద్ధి చెబుతామని న్యాయం జరిగేవరకు పోరాడుతామని అన్నారు.

ఒక్క రైతుబంధు ఇచ్చి.. మొత్తం సబ్సిడీ వ్యవస్థనే కేసీఆర్ నాశనం చేశారు అంటూ విమర్శించారు. రైతుల అప్పుల విషయంలో తెలంగాణ (Telangana) దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని ఇదేనా రైతులకు ప్రభుత్వం చేసే మేలు? అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కువగా ఆత్మహత్యలు జరిగేది కూడా తెలంగాణలోనేనని కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించారు.

24 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్ధానం చేసిన సీఎం కేసీఆర్(KCR) ఆ మాట ఏమైంది? ఎక్కడిస్తున్నారు 24 గంటల కరెంట్? అంటూ ప్రశ్నించారు.  ప్రశ్నించేవారి గొంతులు నొక్కేస్తున్నారని.. నియంతలా వ్యవహరిస్తు బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ అణగదొక్కాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్(KTR) ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: కలిసి పోరాడదాం అంటూ షర్మిల‌ చేసిన ఫోన్ కాల్‌పై బండి‌ సంజయ్ హాట్ కామెంట్స్