Bandi Sanjay : ‘ఆడవాళ్లపై దాడులను నియంత్రించలేని దొరా.. నీపాలనకు సెలవు దొరా’ అంటూ కేసీఆర్‌పై బండి విమర్శలు

Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు.

Bandi Sanjay : ‘ఆడవాళ్లపై దాడులను నియంత్రించలేని దొరా.. నీపాలనకు సెలవు దొరా’ అంటూ కేసీఆర్‌పై బండి విమర్శలు

BJP leader Bandi Sanjay criticizes BRS Govt

Bandi Sanjay : బీఆర్ఎస్ పై విమర్శలు చేసే ఏ అంశాలన్ని బీజేపీ వదలటంలేదు. ప్రతీ విషయంపై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ బీజేపీ బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది.విమర్శలతో ఏకిపారేస్తోంది. తాజాగా తెలంగాణలో మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు అంశాంపై బీజేపీ దీక్ష చేపట్టింది. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు వద్ద తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ విమర్శలు సంధించారు.

మెడికో ప్రీతీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రీతిది ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. ప్రీతీ విషయంలో సరైన సమయంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేదికాదన్నారు. ప్రీతి ఎలా చనిపోయింది అనే విషయాన్ని ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రులకే చెప్పలేదని ఈ కేసును నీరుకార్చే యత్నం జరుగుతోంది అంటూ ఆరోపించారు బండి సంజయ్. కేసీఆర్ కు రాష్ట్రంలో మహిళల భద్రత గురించి పట్టదుగానీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కూతుర్ని విడిపించటానికి మాత్రం నానా పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించన సొమ్మంతా ఢిల్లీలో పెట్టారని అక్కడ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ పరువు తీశారంటూ దయ్యబట్టారు బండి సంజయ్.

Telangana : యూపీ తరహాలోనే బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్చేస్తాం : బండి సంజయ్

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అప్పుడు మహిళలపై కన్నెత్తి చూడాలంటేనే దుర్మార్గులు హడలిపోయేలా చర్యలు తీసుకుంటామని ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఇక వారి జీవితాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందనని అటువంటి భరోసాను బీజేపీ మాత్రమే ఇవ్వగలదు అని అన్నారు బండి. అత్యాచారాలు చేసే దుర్మార్గుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చిపారేస్తామని అన్నారు బండి.

తెలంగాణలో మహిళలపై అన్యాయాలు,అక్రమాలు,అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించిన బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డ అంటే కేసీఆర్ బిడ్డేనా? నిధులు, పదవులు అన్నీ ఆమెకేనా? అంటూ ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ బిడ్డ అయినందుకు అన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.