Data Theft Case : డేటా చోరీ కేసులో సంచలనం.. ఏకంగా 66కోట్ల మంది డేటా అమ్మేశాడు, ప్రధాన నిందితుడు అరెస్ట్
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాము. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడు. ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అదుపులోకి తీసుకున్నాము.(Data Theft Case)

Data Theft Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డేటా చోరీ కేసులో మరో వ్యక్తిని(ప్రధాన నిందితుడు) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 24 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల డేటాను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులతో పాటు 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటాను అమ్మేసినట్లు నిర్ధారించారు. inspirewebz వెబ్ సైట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైన వారికి వ్యక్తిగత వివరాలను విక్రయించాడు నిందితుడు వినయ్ భరద్వాజ. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే వంటి వ్యవస్థల నుంచి నిందితుడు డేటాను కలెక్ట్ చేశాడు.(Data Theft Case)
”66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాము. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడు. ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అదుపులోకి తీసుకున్నాము. డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5లక్షల మంది ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు.
డీ-మార్ట్, నీట్, పాన్కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్కంట్యాక్స్, డిఫెన్స్కు సంబంధించిన అధికారుల డేటా చోరీ చేశాడు. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ చేశాడు. జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్ సహా మరికొన్ని సైట్ల నుంచి డేటా చోరీ చేసి అమ్మేశారు. బై జ్యూస్, వేదాంత సంస్థల డేటా లీక్ చేశాడు” అని పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ప్రధాన నిందితుడు వినయ్ భరద్వాజ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 16 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను చోరీ చేసినట్లు ఆధారాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు.. తమ విచారణలో మొత్తం 66 కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ డేటాను సైబర్ క్రైమ్ నేరగాళ్లకు విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు.
డేటా చోరీ కేసులో పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారి వినయ్ భరద్వాజని సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మెట్రో పాలిటిన్ నగరాల్లో దాదాపుగా 4.5లక్షల మంది ఉద్యోగులను ఏర్పాటు చేసి వారి ద్వారా డేటా కలెక్ట్ చేసి మోసాలకు పాల్పడ్డాడు వినయ్ భరద్వాజ్.(Data Theft Case)