Delhi liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దూకుడు.. హైదరాబాద్తోపాటు ఒకేసారి 35 చోట్ల సోదాలు
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Delhi liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన సమీర్ మహేంద్రు నివాసమైన ఢిల్లీతోపాటు కేసుతో సంబంధం ఉన్న లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
Pakistan floods: పాకిస్తాన్లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది
35కుపైగా ప్రదేశాల్లో, ఒకే సమయంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో పాత్రధారులుగా ఉన్న అరుణ్ రామ చంద్రపిళ్లైతోపాటు మరో ఐదుగురు అనుమానితులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్లకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంఫై కూడా ఈడీ దాడి చేసి సోదాలు చేస్తోంది. అ
యితే, ఈ కేసులో ముందునుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని మనీష్ సిసోడియా ఇంట్లో మాత్రం ఎలాంటి సోదాలు చేయడ లేదని ఈడీ తెలిపింది. ఈ కేసుతో సంబంధం లేదని మనీష్ సిసోడియా చెబుతున్నారు.