Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడి హోటల్ కూల్చివేత.. నంద కుమార్ కుటుంబ సభ్యుల అభ్యంతరం

ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్‌కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడి హోటల్ కూల్చివేత.. నంద కుమార్ కుటుంబ సభ్యుల అభ్యంతరం

Hyderabad: ఇటీవలి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్ హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్, ఫిలింనగర్‌లో నంద కుమార్ డెక్కన్ కిచెన్ పేరుతో ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు.

Pawan Kalyan: ఓట్లు రాకపోయినా నామినేషన్లు వేస్తాం.. యువత చెడిపోతుందనే ఒక్క యాడ్ కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

ఈ నిర్మాణం అక్రమమని తేలడంతో జీహెచ్ఎంసీ ఈ చర్యలకు దిగింది. జేసీబీలతో అధికారులు హోటల్ సముదాయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. డెక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ నుంచి ఈ స్థలాన్ని నంద కుమార్ లీజుకు తీసుకుని, హోటల్ నిర్వహిస్తున్నాడు. గతంలోనే నోటిసులు ఇచ్చినప్పటికీ స్పందన లేదని అధికారులు అంటున్నారు. దీంతో హోటల్ కూల్చివేస్తున్నట్లు చెప్పారు. హోటల్ కూల్చివేతపై నందకుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కూల్చవద్దంటూ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలా కూలుస్తారంటే ప్రశ్నించింది. ఈ అంశంపై జీహెచ్ఎంసీ అధికారులపై నందకుమార్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు.