దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం : కీలకంగా మారనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

  • Published By: bheemraj ,Published On : November 10, 2020 / 03:39 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం : కీలకంగా మారనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది అనూహ్యరీతిలో రౌండ్ రౌండ్ కు మారిపోతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారనున్నాయి.



టీఆర్ఎస్ కు 720, బీజేపీకి 368 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఈవీఎంల కౌంటింగ్ పూర్తైన తర్వాత ఈసీ అభర్థులకు పోస్టల్ బ్యాలెట్లను కలపనుంది. 23 రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఈసీ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలపనుంది.



దుబ్బాకలో 22 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 438 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 61,119, టీఆర్ఎస్ 60,061, కాంగ్రెస్ 21,239 ఓట్లు సాధించాయి. పోలైన ఓట్లు 1,64,192, ఇప్పటివరకు 1,58,621 ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఇంకా లెక్కించాల్సినవి 5,571 ఓట్లు ఉన్నాయి.