క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ పండుగ
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ పండుగకు హైదరాబాద్లోని బాలయోగి స్టేడియం వేదికైంది. కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు, అలాగే సమాధి నుంచి లేచిన రోజును గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు.