Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సినీ హీరోయిన్ పూనమ్‌కౌర్.. వారి సమస్యలపై రాహుల్‌తో చర్చ

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సినీ హీరోయిన్ పూనమ్‌కౌర్.. వారి సమస్యలపై రాహుల్‌తో చర్చ

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ రోజు యాత్రలో భాగంగా రాహుల్ వెంట కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లోని ప్రజల వద్దకు వెళ్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Bharat jodo yatra : భారత్ జోడో యాత్రలో కొత్త మైల్ స్టోన్ .. 50 రోజులు..1300 కిలోమీటర్లకు పైగా సాగిన రాహుల్ యాత్ర

రాహుల్ గాంధీ పాదయాత్రలో శనివారం ఉదయం సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ తో చర్చించానని, రాహుల్ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. అంతేకాక చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని కోరినట్లు పూనమ్ కౌర్ తెలిపింది.

Rahul Jodo Yatra : ‘విద్వేషం చోడో.. భారత్ జోడో’.. భారత్‌కు కొత్త రాహుల్‌ని పరిచయం చేసిన జోడో యాత్ర

పూనమ్ కౌర్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు అగ్రహీరోలతోనూ పూనమ్ నటించింది. అయితే, ఉన్నట్లుండి ఆమె రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రత్యక్షం కావటం చర్చనీయాంశంగా మారింది.