Murder : వదినను హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన మరిది, జైలుకి పంపిందని ప్రతీకారం

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.

Murder : వదినను హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన మరిది, జైలుకి పంపిందని ప్రతీకారం

Man Murder Women And Burnt Dead Body

Man Murder Women And Burnt Dead Body : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు. శనివారం(మే 22,2021) రాత్రి ఈ దారుణం జరిగింది. పాతకక్షలతో వదినను మరిదే ప్రణాళిక ప్రకారం మర్డర్ చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బట్టవానికుంట సమీపంలో పొలం దగ్గరికి ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. అక్కడ డెడ్ బాడీని కాల్చేశాడు. వదినను హత్య చేసిన మరిది రేక సైదులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతురాలి పేరు రేక బయ్యమ్మ(55). రామాపురంలో తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.

తనను జైలుకి పంపిందనే ప్రతీకారంతోనే వదినను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 2004లో జరిగిన సోదరుడు రేఖ పిచ్చయ్య హత్య కేసు తనపై అన్యాయంగా మోపడంతో తాను మూడు నెలలు జైలులో ఉన్నానని.. ఆ పగతోనే వదినను హత్య చేశానని సైదులు పోలీసులతో చెప్పాడు.

ఇటీవల నుంచి ఇంటి స్థలం, పొలం విషయంలో తరచుగా గొడవ జరుగుతోందని వీటిని దృష్టిలో పెట్టుకుని తన తల్లి బయ్యమ్మను హత్య చేశారని మృతురాలి కూతురు కవిత చెప్పింది. హుజూర్‌నగర్‌ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బయ్యమ్మ కూతరు ఫిర్యాదు మేరకు పోలీసులు రేక సైదులు, భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉపేందర్‌, హేమంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.