KTR : కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన.. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ కు ఓటేస్తే 6 నెలలకో సీఎం రావడం ఖాయం అన్నారు. కర్ణాటకలో 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.

KTR : కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన.. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం : మంత్రి కేటీఆర్

Minister KTR (5)

Minister KTR Criticized : కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటే అంధకారం, కరెంట్ కోతలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్టపాలన వస్తుందన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే 6 నెలలకో సీఎం రావడం ఖాయం అన్నారు. కర్ణాటకలో 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని కర్ణాటక రైతులు బాధపడుతున్నారని తెలిపారు.

కర్ణాటకలో రైతులు, పారరిశ్రామిక వేత్తలు రోడ్లపై ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. 2014కు ముందు విద్యుత్ సరఫరా ఎలా ఉంది, ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ సరఫరా ఎలా ఉందన్నారు. కర్ణాటకలో 5 గంటలే విద్యుత్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శించారు.

CPM : కాంగ్రెస్ తో కుదరని పొత్తు.. సీపీఎం ఒంటరిగానే పోటీ!

బీజేపీ రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. దేశంలో 30 శాతం పంచాయతీ అవార్డులు మనకే వస్తున్నాయని తెలిపారు. గతంలో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదన్నారు.