Renuka Chowdhury : తెలంగాణ కోడలిని అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అలాంటి వాళ్లను రాజకీయ రాబందులు అంటారు- వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు

ఊరు పేరు లేని వాళ్లు అంతా వచ్చి వాలితే.. రాజకీయ రాబందులు అంటారు అలాంటి వాళ్లని. Renuka Chowdhury - YS Sharmila

Renuka Chowdhury : తెలంగాణ కోడలిని అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అలాంటి వాళ్లను రాజకీయ రాబందులు అంటారు- వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత నిప్పులు

Renuka Chowdhury - YS Sharmila (Photo : Google)

Renuka Chowdhury – YS Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. పాలేరులో పోటీ చేస్తాను అని షర్మిల అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలున్నారా? అంటూ షర్మిలపై సెటైర్లు వేశారు రేణుకా చౌదరి.

తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇప్పుడే గుర్తు వచ్చిందా? షర్మిల ముందు అమరావతిలో రైతుల గురించి మాట్లాడాలని మండిపడ్డారు. అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? తెలంగాణలో షర్మిల ఎంతో ఏపీలో నేను కూడా అంతే అన్నారు రేణుకా చౌదరి. తాను ఏపీ కోడలిని, తెలంగాణ ఆడబిడ్డను అన్నారు. షర్మిల తెలంగాణలో పోటీ చేసే విషయంలో అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న రేణుకా చౌదరి.. దీనిపై తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని రేణుకా చౌదరి తేల్చి చెప్పారు.

Also Read..Telangana elections 2023: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా వచ్చేస్తుంది.. ఆ జాబితానే ఫైనల్: రేవంత్ రెడ్డి

”మా కార్యకర్తలు ఎవరి పేరు చెబుతారో పాలేరు నుంచి వారు నిలబడితేనే అందంగా ఉంటుంది. షర్మిల పాలేరులో పుట్టిందా? పాలేరుకి ఏమైనా చేసిందా? పాలేరు డెవలప్ మెంట్ అయ్యిందా? ఏ సమస్యను షర్మిల పరిష్కరించారు? ఊరు పేరు లేని వాళ్లు అంతా వచ్చి వాలితే.. రాజకీయ రాబందులు అంటారు అలాంటి వాళ్లని. తెలంగాణ కోడలు అని ఇవాళ గుర్తుకొచ్చిందా? ఇన్ని సంవత్సరాలు షర్మిల ఎక్కడున్నారు?” అని తీవ్ర వ్యాఖ్యలతో షర్మిలపై విరుచుకుపడ్డారు రేణుకా చౌదరి.