Karimnagar: అన్నను రోకలితో కొట్టి చంపిన చెల్లెలు.. కారణం ఇదే!

రాను రాను మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. కొందరు తరతమ బేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తోడబుట్టినవారిపైనే దారుణానికి ఒడిగడుతున్నారు.

Karimnagar: అన్నను రోకలితో కొట్టి చంపిన చెల్లెలు.. కారణం ఇదే!

Karimnagar News

Karimnagar: రాను రాను మహిళలకు సొంతింట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. కొందరు తరతమ బేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తోడబుట్టినవారిపైనే దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా జరిగిన ఘటన మహిళలకు ఇంట్లో రక్షణ కరువైందనడానికి ఉదాహరణగా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన అన్నను, చెల్లి రోకలిబండతో మోది హత్యచేసింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. విద్యానగర్‌లో నివాసముంటున్న సతీష్ ( 35 ) అనే వ్యక్తి గురువారం రాత్రి ఫుటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో చెల్లితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

అన్న బారినుంచి తప్పించుకునే సమయంలో పక్కనే ఉన్న రోకలి బండతో బలంగా తలపై కొట్టింది. సతీష్ తలపై బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి సతీష్ తల్లిని పోలీసులు విచారించారు. అనంతరం హత్యకు కారణమైన మహిళను అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించారు.