Telangana BJP: ఎన్నికల మూడ్‌లోకి తెలంగాణ బీజేపీ.. 14 ఎన్నికల కమిటీలు ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను ప్రకటించింది.

Telangana BJP: ఎన్నికల మూడ్‌లోకి తెలంగాణ బీజేపీ.. 14 ఎన్నికల కమిటీలు ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే

Telangana BJP

Telangana BJP Election Committees: తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను తెలంగాణ బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీల్లో వివేక్ వెంకట్ స్వామి, రాజగోపాల్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది.

Read Also : BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షత న బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా బిఎల్ సంతోష్, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్లమెంటు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావులు హాజరయ్యారు. వీరితోపాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జిలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన జిల్లా ఇన్ చార్జులు పాల్గొన్నారు. 40 రోజులకు పార్టీ కార్యక్రమాలపై ప్రణాళికల సిద్దం చేయనున్నారు. ఈ క్రమంలో సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్నికల కమిటీలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.

Read Also : Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. రంగంలోకి ఎన్నికల కమిటీ సభ్యులు.. మోదీ రాకతో మరింత జోష్

కమిటీల వివరాలు ఇలా..
1. సోషల్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మణ్ (ఎంపీ)
కన్వీనర్ బొర్రా నర్సయ్యగౌడ్ (మాజీ ఎంపీ)
2. పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ కుమార్ (ఎంపీ)
కన్వీనర్ జి. ప్రేమేందర్ రెడ్డి
జాయింట్ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు.
3. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డీకే అరుణ.
కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
4. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి.
జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
5. చార్జిషీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
కన్వీనర్ లక్ష్మీనారాయణ (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ రామచంద్రుడు(రిటైర్డ్ ఐఏఎస్)
6. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్.
7. యాక్షన్ కమిటీ చైర్మన్ విజయశాంతి (మాజీ ఎంపీ)
కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి
8. సోషల్ మీడియా చైర్మన్ ధర్మపురి అరవింద్
కన్వీనర్ పొరెడ్డి కిషోర్ రెడ్డి
9. ఎన్నికల కమిషన్ ఇష్యూష్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి
కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్
10. హెడ్ క్వార్టర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనా రెడ్డి
కన్వీనర్ బంగారు శృతి
11. మీడియా కమిటీ చైర్మన్ రఘునందన్ రావు,
కన్వీనర్ ఎన్. రామచంద్రరావు. (మాజీ ఎమ్మెల్సీ)
జాయింట్ కన్వీనర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి (బీజేపీ సెక్రటరీ)
12. క్యాంపెయిన్ ఇష్యూ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్.
కన్వీనర్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
13. ఎస్సీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి.
కన్వీనర్ జి. విజయ రామారావు (మాజీ మంత్రి)
14. ఎస్టీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు.
కన్వీనర్ సోయం బాపూరావు (ఎంపీ)
జాయింట్ కన్వీనర్ డి. రవీంద్ర నాయక్