తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు చేసింది.

సప్లిమెంటరీ పరీక్షలు రద్దు కావడంతో అవి రాయకుండానే పాస్ చేస్తామని హామీ ఇచ్చింది ఇంటర్ బోర్డు. గతంలో టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు పాస్ చేసినట్లుగా సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు అయిపోయినట్లే. అంటే 2019-2020 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులంతా ప్రమోట్ అయిపోయినట్లే లెక్క.