Telangana Corona: తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్(Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..
Telangana Corona: తెలంగాణలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 527 కరోనా టెస్టులు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 64 కొత్త కేసులు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో కొత్త కేసులు లేవు. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే వచ్చాయి.
అదే సమయంలో మరో 401 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,083 మంది కరోనా(Telangana Corona) బారినపడగా వారిలో 7,82,253 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 2వేల 719 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 4వేల 111 మంది కోవిడ్ తో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 156 కరోనా కేసులు వచ్చాయి.
India Covid-19 Update : దేశంలో కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు
అటు దేశంలోనూ రోజురోజుకూ కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల 10 వేల దిగువకు చేరిన కొత్త కేసులు.. తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్యా అదుపులోనే ఉంది. సోమవారం 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 915 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులు డిసెంబర్ చివరినాటి స్థాయికి చేరాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. ఇక ఇప్పటివరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది.
24 గంటల వ్యవధిలో మరో 180 మంది కోవిడ్ తో చనిపోయారు. క్రితంరోజు ఆ సంఖ్య 120 దిగువన ఉంది. దేశంలో ఇప్పటివరకు 5,14,023 మంది కోవిడ్ తో మరణించారు. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. దాంతో యాక్టివ్ కేసుల రేటు 0.22 శాతానికి
తగ్గిపోయింది. నిన్న 16,864 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. రికవరీ రేటు 98.59 శాతానికి పెరిగింది. మరోపక్క 18 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 177 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్లో భారత్లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.01.03.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Vv908UPSkx— IPRDepartment (@IPRTelangana) March 1, 2022