మిర్యాలగూడలో అమానుషం : ఆస్తి కోసం బాలికపై చిన్నమ్మ పైశాచికం…11 రోజులుగా గదిలో బంధించి చిత్రహింసలు

  • Published By: bheemraj ,Published On : November 19, 2020 / 11:16 AM IST
మిర్యాలగూడలో అమానుషం : ఆస్తి కోసం బాలికపై చిన్నమ్మ పైశాచికం…11 రోజులుగా గదిలో బంధించి చిత్రహింసలు

Tortured on girl for property : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అమానుషం జరిగింది. ఆస్తి కోసం మైనర్ బాలికను బంధించి చిత్రహింసలు పెట్టింది చిన్నమ్మ. ఓ వ్యక్తితో కలిసి 11 రోజల పాటు బాలికను బంధించి..తీవ్రంగా వేధించింది. రాత్రి బాలికను ఇంటి దగ్గర వదిలివేసింది.



ఆస్తి విషయంలో సొంత అక్కతో ఏర్పడిన వివాదంతో ఆమె నుంచి అప్పు నుంచి అప్పు రాబట్టేందుకు
అక్క కూతురుని తీసుకెళ్లి గదిలో బంధించింది. బట్టలు కొనిస్తానని చెప్పి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లింది. అప్పటి నుంచి కూడా కూతురు ఇంటికి రాకపోవడంతో అక్క మంగమ్మ చాలా సార్లు చెల్లెలు కళ్యాణిని సంప్రదించింది. అయితే చెల్లెలు నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.



బాలిక కనిపించడం లేదని ఈ నెల 8వ తేదీన మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఇంటి దగ్గర పడి ఉన్న బాలికను చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.



అయితే పాపను చిన్నమ్మ తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. చిన్నమ్మతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.