Munugodu: మునుగోడులో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.

Munugodu: మునుగోడులో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్

Munugodu: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరుకానున్నారు.

Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్

కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు జగదీష్ రెడ్డి, వామపక్ష నేతలు, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో ప్రచారవ్యూహంపై పార్టీ నేతలతో కేటీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఉప ఎన్నికను కేటీఆర్ సీరియస్‌గా తీసుకుని, నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేకసార్లు ఇంఛార్జ్‌లతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు మునుగోడులో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం సాగుతోంది.

Chinese Visas: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత భారతీయ విద్యార్థులకు చైనా వీసా

కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్‌సహా పలువురు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కోమటిరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు.