YS Sharmila : గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ’బీజేపీ రాష్ట్ర సమితి‘ దోస్తానా : వైఎస్ షర్మిల

ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది రాష్ట్రంలో అంటూ సెటైర్లు వేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే..5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

YS Sharmila : గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ’బీజేపీ రాష్ట్ర సమితి‘  దోస్తానా : వైఎస్ షర్మిల

YS Sharmila

CM KCR..YS Sharmila : రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న ఈ బందిపోట్లకు..ఎదురెళ్లి మోడీని నిలదీసే దమ్ము మాత్రం లేదు అంటూ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది రాష్ట్రంలో అంటూ సెటైర్లు వేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే..5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయలేదని విమర్శిస్తారు.. కానీ విభజన హామీలు అమలు చేయండి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటంలేదు అని ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ విమర్శలు సంధించారు. తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదు?అని ప్రశ్నించారు.

TS High Court : మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ?కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా?అని ప్రశ్నించారు షర్మిల. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా?ఏటా బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే..మీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా? అంటూ ఎద్దేవా చేశారు.గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే “బీజేపీ రాష్ట్ర సమితి” దోస్తానా.. అంటూ ఆరోపించారు.దొరకు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదు అంటూ విమర్శలు సంధించారు.కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి..రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్ అండ్ కో కు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదు అంటూ దుయ్యబట్టారు షర్మిల.