హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల కీలక సమావేశం.. ఏం చెప్పనున్నారు?

హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల కీలక సమావేశం.. ఏం చెప్పనున్నారు?

ys-sharmila-key-meeting-in-hyderabad

ys sharmila key meeting in hyderabad: ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు(ఫిబ్రవరి 9,2021) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమానులు, అనుచరులు భారీగా తరలి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సమ్మేళనం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. షర్మిల ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇవాళ(ఫిబ్రవరి 8,2021) సాయంత్రం లేదా రేపు ఉదయం ఆమె హైదరాబాద్ కి చేరుకోనున్నారని సమాచారం.

వైఎస్ఆర్ అభిమానులు ఈ సమావేశానికి రావాల్సిందిగా నేతలకు స్వయంగా కాల్ చేసి మరీ ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అజెండా ఏంటనేది మాత్రం వెల్లడి కావడం లేదు. షర్మిల కొత్త పార్టీ ఊహాగానాల నేపథ్యంలో రేపటి భేటీకి రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.