YS Sharmila : ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు : వైఎస్ షర్మిల

స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.

YS Sharmila : ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు : వైఎస్ షర్మిల

YS Sharmila (2)

YS Sharmila comments CM KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడు అని విమర్శించారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడని మండిపడ్డారు.

గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడని పేర్కొన్నారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు దొర అంటూ కేసీఆర్ ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించాడని ఆరోపించారు. బీసీలకు రూ.55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కానీ, రూపాయి ఇచ్చింది లేదన్నారు.

YS Sharmila : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ ను ప్రశ్నిస్తే కేసులు.. జర్నలిస్టులకు అండగా ఉంటాం : వైఎస్ షర్మిల

స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయించి రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. ఐదేళ్ల క్రితం కేసీఆర్ హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కిందని ఎద్దేవా చేశారు.

50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైందన్నారు. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదని వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదని విమర్శించారు. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డాడని ఆరోపించారు.

YS Sharmila : బీఆర్ఎస్-బీజేపీ దొందు దొందే.. కేసీఆర్ 420, మోసగాడు : వైఎస్ షర్మిల

బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె.. చేపలు పట్టుకోవాలె.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన దొరకు.. 60 లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయని వైఎస్ షర్మిల హెచ్చరించారు.