అష్టాదశ శక్తిపీఠాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారా?
అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది.

Astadasha Shakti Peethas
Astadasha Shakti Peethas: ఆదిపరాశక్తే చరాచర జగతికి మూలమని హిందువులు నమ్ముతారు. దక్షుడి కుమార్తెగా జన్మించిన ఆదిపరాశక్తి (సతీదేవి) పరమేశ్వరుడిని వరించింది. దక్షుడు చేస్తున్న యాగానికి తమకు ఆహ్వానం లేకున్నా వెళ్లింది. దీంతో పరమేశ్వరుడిని దక్షుడు నిందించాడు.
ఆదిపరాశక్తి తట్టుకోలేక అగ్నిప్రవేశం చేసింది. అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి.
18 మహా శక్తి పీఠాలు ఇవే..
శాంకరీ దేవి (త్రింకొమలీ, శ్రీలంక)
కామాక్షీదేవి (కాంచీపురం, తమిళనాడు)
శృంఖలాదేవి (పాండువా, హూగ్లీ, పశ్చిమబెంగాల్)
చాముండేశ్వరి దేవి (మైసూరు, కర్ణాటక)
జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ)
భ్రమరాంబికా దేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
మహాలక్ష్మి దేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర)
ఏకవీరా దేవి / రేణుకా మాత (నాందేడ్, మహారాష్ట్ర)
మహాకాళీ దేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్)
పురుహూతికా దేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్)
బిరజా దేవి/గిరిజా దేవి (జాజ్పూర్, ఒడిశా)
మాణిక్యాంబా దేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
కామాఖ్యాదేవి (కామాఖ్యా దేవి, గువాహటీ, అసోం)
మాధవేశ్వరి (ప్రయాగ్, ఉత్తరప్రదేశ్)
జ్వాలాముఖి దేవి (కాంగ్రా, హిమాచల్ప్రదేశ్)
సర్వమంగళా దేవి/మంగళగౌరి దేవి (గయా, బిహార్)
విశాలాక్షి దేవి (వారణాసి, ఉత్తరప్రదేశ్)
సరస్వతీదేవి (జమ్మూకశ్మీర్)