Girl molested : గిరిజన బాలికపై వాలంటీర్ తోపాటు ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్

బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Girl molested : గిరిజన బాలికపై వాలంటీర్ తోపాటు ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్

girl molested

Girl molested in Prakasam : ప్రకాశం జిల్లా సింగరాకొండ మండలం బింగిన పల్లి గిరిజన వాడలో దారుణం జరిగింది. ఓ గిరిజన బాలిక పై వాలంటీర్ ఆధ్వర్యంలో యువకులు సామూహిక అత్యాచారానికి పల్పడ్డారు. సచివాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లోకి తీసుకెళ్ళి ముగ్గురు మానవ మృగాలు అత్యాచారం చేశారు. బింగినపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మేదాడి ప్రతాప్ ఆటో డ్రైవర్, మేదాడి హరి వాలంటీర్, అల్లాడి వంశీ ఆటో డ్రైవర్ ఫూట్ గా మద్యం తాగి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్ తో పాటు ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి రంగంలోకి దిగారు.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కంట్రోల్ రూమ్ పేరు మార్పు.. టీఎస్ ప్రత్యేక రక్షణదళం పేరు తొలగింపు

బాధిత బాలికను డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి పరామర్శించారు. మొదట బాలిక భయపడి వాస్తవం చెప్పకపోవడంతో అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని డిఎస్పీకి బాలిక వాగ్మూలం ఇవ్వడంతో సామూహిక అత్యాచారంగా కేసు నమోదు చేశారు. చికిత్స కోసం బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కీచక మానవ మృగాలను కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని బాలిక, కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. బాలిక నుంచి వీడియో గ్రఫీతో వాంగ్మూలం తీసుకున్నారు. పొక్సో, కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కు సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మీడియాకు తెలిపారు.