Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపులు.. ఎనిమిది జిల్లాల్లోనే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపులు..  ఎనిమిది జిల్లాల్లోనే!

Curfew

Updated On : June 28, 2021 / 2:42 PM IST

Andhra Pradesh Government Curfew: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే ఇకపై కర్ఫ్యూ కొనసాగనుంది. కొవిడ్‌ పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపులను ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ సడలింపు సమయం జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐదు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపు ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఐదు జిల్లాల్లో సడలింపుపై మరోసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.