positive for 16 students : 16మంది మెడికల్ కాలేజీ విద్యార్ధులకు కరోనా
ఏపీలోని మెడికల్ కాలేజీ హాస్టల్ లో కరోనా కలకలం రేపింది. 16మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గేదేలేదు అంటోంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసుల పెరుగుతు కలకలం సృస్టిస్తున్నాయి. ఈ క్రమంలో హాస్టల్ లో ఉంటున్న 16మంది విద్యార్ధులకు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ డా.బాబ్జి వెల్లడించారు.
జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో 16 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుమారు రెండు వందల మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిం,గా వారిలో 16 మందికి పాజిటీవ్ గా తేలింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను… హస్టల్ లోనే… ఐసోలేషన్ లో ఉంచారు. వారికి కావాల్సిన అన్ని వసతుల్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.
Read more : Maharashtra : మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్
మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉంటున్న ఇంతమంది విద్యార్ధులకు కరోనాకు గురికావటంతో అధికారులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీలో ఫంక్షన్ కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందింది ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ విద్యార్థి వల్లే మిగిలినవారికి కూడా కరోనా సోకిందని..అదికాస్తా హాస్టల్ కరోనా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. హాస్టల్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో హస్టల్ లో అందరూ అలర్ట్ అయ్యారు.
Read more : Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి