Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు

Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు

Vallabhaneni Vamsi

Updated On : December 18, 2025 / 12:02 PM IST

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : DWACRA womans : ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.15వేలు.. తిరిగి చెల్లించాల్సిన పనిలేదు..

2024 జులై నెలలో తనపై వంశీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. వంశీ సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ఆయనపై వరుసగా కేసులు నమోదయ్యాయి.

వల్లభనేని వంశీ ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన వంశీ.. బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీపై మరో కేసు నమోదు కావటం ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.