Purandeshwari : ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి మరోసారి ఘాటు విమర్శలు .. సమాధానం చెప్పాలంటూ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.

Purandeshwari : ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి మరోసారి ఘాటు విమర్శలు .. సమాధానం చెప్పాలంటూ డిమాండ్

Purandeshwari

Purandeshwari .. YCP govt : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. గతంలో లిక్కర్ విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని..ఇసుక అమ్మకాల ద్వారా భారీ అవినీతులకు పాల్పడుతోందని..కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేసిన ఆమె మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

కేంద్రం ఏపీ అభివృద్ధి కోసం పంపిన నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ విమర్శించారు. ఇప్పటి వరకు ఏపీ అభివద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందని అన్నారు. ఏపీలో కొత్తగా ఎటువంటి పరిశ్రమలు రాలేదని రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. అధ్వాన్న స్థితిలో రోడ్లు ఉన్నాయని..అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లించారు అంటూ ఆరోపించారు.

MLA Balakrishna : హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై బాలకృష్ణ సెల్ఫీ చాలెంజ్

రాజధాని అమరావతి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి రైతులను మోసం చేశారు అంటూ దుయ్యబట్టారు. ఆ రైతులకు కనీసం కౌలు డబ్బులు కూడా ఇవ్వటంలేదన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు ఏమయ్యాయో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పురందేశ్వరి డిమాండ్ చేశారు.