టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

జగన్ గురించి, వైసీపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అసవరం లేదని పలువురు ఎంపీలు..

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీ మంత్రుల నుంచి ఆయా శాఖలకు చెందిన సమాచారాన్ని తీసుకోవాలని తమ ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచించారు. వాటిపై కేంద్ర సర్కారుతో సంప్రదింపులు జరపాలని చెప్పారు.

అవసరాలకు అనుగుణంగా ఏపీ మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో భేటీ కావాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని చెప్పారు. ఏపీలో దాడులు జరుగుతున్నాయంటూ ఢిల్లీలో ధర్నా చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా భేటీలో చంద్రబాబు మాట్లాడారు.

జగన్ గురించి, వైసీపీ గురించి అంతగా ఆలోచించాల్సిన అసవరం లేదని పలువురు ఎంపీలు అన్నారు. ఢిల్లీలో జగనేం చేస్తారో ముఖ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ అసత్యపు ప్రచారాన్ని తిప్పికొడదామని చెప్పారు. కాగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.

Also Read: శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. స్పందించిన నటి