CM Jagan Tribute : గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్

గౌతమ్ రెడ్డి మృతి తీరనిలోటు అని సీఎం జగన్ అన్నారు. ఆత్మీయుడిని కోల్పోయామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CM Jagan Tribute : గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్

Cm Jagan

Updated On : February 21, 2022 / 3:25 PM IST

CM Jagan pays tribute : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి నివాసానికి సీఎం జగన్ వెళ్లారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. గౌతమ్ రెడ్డి మృతి తీరనిలోటు అని అన్నారు. ఆత్మీయుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గౌతమ్ రెడ్డి రేపు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. దుబాయ్ పర్యటన వివరాలు చెప్పేందుకు టైమ్ అడిగారు. ఇంతలోనే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

దుబాయ్ ఎక్స్ పో నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపే పరిస్థితి విషమించడంతో గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. సీఎం జగన్ సహా మంత్రులు, పార్టీలకు అతీతంగా నేతలు.. గౌతమ్ రెడ్డి మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎల్లుండి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మేకపాటి తనయుడు విదేశాల్లో ఉన్న కారణంగా.. రేపు సాయంత్రం వరకూ స్వగ్రామం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

AP : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో మృతి చెందగా.. ఆయ‌న బౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తీసుకుని వెళ్లారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అపోలో ఆసుప‌త్రికి చేరుకోగా.. అక్కడి నుంచి ఇంటికి వస్తున్నారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ష‌ర్మిల కూడా మేకపాటి పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.