Shankar Reddy: వివేకా హత్యకేసుపై సీబీఐకి శంకర్ రెడ్డి లేఖ.. అనుమానాలపై విచారణకు డిమాండ్
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ధర్యాప్తు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై చర్చ జరుగుతుంది.

Devireddy
Shankar Reddy: ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ధర్యాప్తు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై చర్చ జరుగుతుంది. ఈ హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తావన రాగా.. లేటెస్ట్గా దేవిరెడ్డి శంకర్ రెడ్డి సీబీఐ డైరెక్టర్కు లేఖ రాశారు. ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను నిర్దోషినంటూ చెప్పుకొచ్చారు. నన్ను ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. వివేకా మరణం గురించి నాకు తెలిసిందే తెల్లవారుఝామున అని అన్నారు వివేకా. హైదరాబాద్లో వివేకానందరెడ్డి బావమరిది ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్.. పలుమార్లు నన్ను విచారించిందని, 2019 మార్చి నెలలో వారంరోజులపాటు నాపై విచారణచేశారని చెప్పారు. విచాణ సమయంలో నన్ను తీవ్రంగా హింసించారని కూడా లేఖలో రాశారు. మళ్లీ 2019 నవంబర్లో నన్ను విచారించారని, ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మరో మూడు సార్లు నాపై విచారణ జరిగిందన్నారు.
ప్రతిసారి నేను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను.. వైఎస్ వివేకా హత్య తర్వాత ఆమె కుమార్తె సునీత ప్రతిరోజూ మీడియతో టచ్లోనే ఉంటున్నారు. దురుద్దేశాలను ఆపాదిస్తూ పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, దర్యాప్తు అధికారులను కలుస్తూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. దర్యాప్తు సరైన మార్గంలో నడుస్తుందనుకుంటున్న సమయంలో వివేకా కుమార్తె సునీత మీడియా ముందుకు వచ్చి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఆమె ఇష్టాయిష్టాల ప్రకారం.. అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ, నిందలు మోపారని అన్నారు. సునీత లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై ఓ వర్గం మీడియా పథకం ప్రకారం ప్రచారం చేసిందని అన్నారు. ఓ ఛానెల్, పత్రిక ఎండీతో సునీత నిరంతరం టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే ఛానల్, పత్రిక వైసీపీ పైన, అమాయకులపైన నిరంతరం దుష్ప్రచారం చేసిందని అందులో రాసుకొచ్చారు. కారణాలేంటో తెలియదుగాని సునీత వ్యవహారం భిన్నంగా ఉందన్నారు. వివేకా భౌతికకాయం దగ్గర దొరికిన లేఖ వ్యవహారంలో సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డితో పాటు, ఎన్.శివప్రకాష్రెడ్డి వ్యవహారశైలి అసహజంగా ఉందన్నారు. ఈ విషయాలు అన్నీ చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు చెప్పారు.
వివేకా హత్య ఘటనలో దాగి ఉన్న వ్యక్తులను బయటకు లాగాలని కోరారు. వారు చాలా క్రూరులని, నిజాలను వెలికి తీయాలన్నారు. దర్యాప్తు సక్రమంగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరగకపోతే, హంతకులు తప్పించుకుని, అమాయకులు బలయ్యే అవకాశం ఉందని శంకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వివేకా ఫోన్లోని డేటాను, సమాచారాన్ని వారు టాంపర్చేసి, డిలీట్ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా? లేదా? తేల్చాలన్నారు.
ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు? ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు? ఆయనతో టచ్లో ఉన్న వివేకా కుటుంబ సభ్యులు ఎవరు? ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని, వీడియో తీయాలని ఆదేశాలు ఇచ్చిన ఇనాయతుల్లాకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పీఏ మూలి వెంకట కృష్ణా రెడ్డి మొబైల్ఫోన్, వివేకా రాసినట్టుగా చెప్తున్న లేఖను ఎందుకు దాచిపెట్టారు? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులతో సమావేశమయ్యారని శంకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రతివారం వారితో సమావేశం జరిపారని.. ఇన్ని సార్లు కలవడం వెనుక కారణం ఏంటిని ప్రశ్నించారు. ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా.. అని నిలదీశారు. ఇంటరాగేషన్ లేకుండా దస్తగిరికి కేవలం ఐదురోజుల్లో ముందస్తు బెయిల్ మంజూరు అయ్యిందని.. సునీత భర్తే లాయర్ను పెట్టి ఆయనకు బెయిల్ ఇప్పించాడని పేర్కొన్నారు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత, ఆమె భర్త ఎందుకు సహాయపడుతున్నారని నిలదీశారు.
TRS Maha Darna : మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సండ్ర వెంకట వీరయ్య
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగింది. 40 ఏళ్లుగా వైయస్సార్ కుటుంబానికి పులివెందుల పెట్టనికోటలా ఉంది. వివేకాను తొలగించుకోవడం ద్వారా పార్టీని పెంచుకోవాలనే ఆలోచన చేసి ఉండరా? ఈప్రశ్నకు దర్యాప్తు ద్వారా సమాధానం రాబట్టాలి. వివేకా హత్యకు కొన్ని వారాల ముందు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి సహా తదితరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్లో ఉన్నారు అక్కడే కుట్రలు చేశారు. బిటెక్.రవి, ఆదినారాయణరెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర్రావుతో సమావేశమయ్యారు. మొత్తం కుట్ర అక్కడే జరిగిందని అన్నారు.
T.congress protest : వరిధాన్యం కొనాలంటూ పోరు..కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు..
పరమేశ్వర్రెడ్డి ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఆస్పత్రిలో ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. ఆ తర్వాత బీటెక్ రవితో సమావేశమయ్యాడు. వివేకా హత్యకు ముందురోజు మార్చి, 14, 2019న కడప హరిత హోటల్లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలి. తర్వాత చంద్రబాబు, వివేకా హత్యను తన రాజీకీయ ప్రచారంగా వాడుకున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఘటన గురించే ప్రచారం చేశారు. వివేకా హత్య.. టీడీపీకి అడ్వాంటేజ్. ఈ కోణంలో సీబీఐ విచారణ చేయాలని శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
KCR Maha Dharna : కేంద్రంపై టీఆర్ఎస్ వార్… సీఎం కేసీఆర్ మహా ధర్నా – Live Updates
2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిపై బీటెక్ రవి గెలుపొందారు. వివేకానందరెడ్డి వల్ల బీటెక్ రవి రాజకీయ జీవితానికి అడ్డుపడే అవకాశాలున్నాయన్నారు శంకర్ రెడ్డి. ఈ కోణంలో కూడా విచారణ చేయాలన్నారు. వివేకా ప్రాణాలకు ముప్పుందని తెలిసినా టీడీపీ గన్మెన్లను ఎందుకు తొలగించింది? అతన్ని హత్యచేయాలనే ఉద్దేశంతోనే తొలగించిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. వివేకాను తొలగించాలని బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి కుట్రచేశారని.. పులివెందుల, కడప ప్రాంతాల్లో రాజకీయ స్వలాభం కోసమే ఈ పనికి పాల్పడ్డారని శంకర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య వెనుక చంద్రబాబు, ఏబీ వెంటకేశ్వర్రావు, బి.టెక్.రవి, ఆదినారాయణరెడ్డిల కుట్ర కోణంపై విచారణ చేయాలంటూ సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు దేవిరెడ్డి శంకర్ రెడ్డి.