పవన్ కల్యాణ్ పర్యటనలో డ్రోన్ కెమెరా కలకలం.. ఎవరు పంపారు, ఎందుకు పంపారు?

డ్రోన్ కెమెరాను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం పంపారు? అనేది తెలుసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

పవన్ కల్యాణ్ పర్యటనలో డ్రోన్ కెమెరా కలకలం.. ఎవరు పంపారు, ఎందుకు పంపారు?

Updated On : August 23, 2024 / 10:53 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. తోగురుపేట – పులపత్తూరుకు మధ్యలో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. పవన్ కల్యాణ్ పాల్గొనే సభ వద్ద కూడా డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read : వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

ఇవాళ ఉదయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని గ్రామాలు తిరిగారు. తోగురుపేట-పులపత్తూరు ప్రాంతాల్లో సభలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ డ్రోన్ కెమెరా ఎగరడం, అక్కడున్న పరిస్థితులను షూట్ చేయడం కలకలం రేపింది. అసలు ఆ డ్రోన్ కెమెరాను ఎవరు ఎగురవేశారు? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. పవన్ పాల్గొనే సభ వద్ద కూడా ఈ డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. డ్రోన్ కెమెరాను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం పంపారు? అనేది తెలుసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

డ్రోన్ కెమెరా ఎగరవేయడం, మళ్లీ సడెన్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పాల్గొనే సభాస్థలి వద్ద డ్రోన్ కెమెరా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారం అధికారులను ఆందోళనకు గురి చేసింది. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ఎగురవేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.