మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టింది: గడికోట శ్రీకాంత్ రెడ్డి

అంతమాత్రాన అతని ద్వారా చంద్రబాబుకు సంబంధం ఉందని తాము చెప్పలేము కదా అని నిలదీశారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టింది: గడికోట శ్రీకాంత్ రెడ్డి

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు విచారణ పక్కదారి పట్టిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లె ఫైల్స్ దగ్దం వ్యవహారంలో వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని దర్యాప్తు జరుగుతోందని అన్నారు. అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయని,  ప్రమాదం జరిగినప్పుడు టీడీపీ సానుభూతి పరుడు గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పారు.

అంతమాత్రాన అతడి ద్వారా చంద్రబాబుకు సంబంధం ఉందని మేము చెప్పలేము కదా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదని తెలిపారు. తల్లికివందం అడ్రెస్ లేదని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15 వందల రూపాయలు ఇచ్చేదెప్పుడని ప్రశ్నించారు.

Also Read : అతనికి కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం నాకులేదు: మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ఏ పథకాన్నీ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదని హితవు పలికారు. తమ వైపు తప్పులు ఉంటే సూచించాలని, అలా కాకుండా కేవలం బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Also Read: మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు తాలిబన్లను తలపిస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి