COVID 19 in Andhrapradesh : 24 గంటల్లో 534 కేసులు, ఇద్దరు మృతి

COVID 19 in Andhrapradesh : 24 గంటల్లో 534 కేసులు, ఇద్దరు మృతి

Updated On : December 17, 2020 / 4:29 PM IST

covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. అనంతపురంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 498 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,10,65,297శాంపిల్స్ పరీక్షించారు.

జిల్లాల వారీగా :
అనంతపురం : 16. చిత్తూరు 130. ఈస్ట్ గోదావరి : 45. గుంటూరు : 54. కడప : 27. కృష్ణా : 74. కర్నూలు : 13. నెల్లూరు : 21. ప్రకాశం : 19. శ్రీకాకుళం : 39. విశాఖపట్టణం : 31. విజయనగరం : 14. వెస్ట్ గోదావరి : 21. మొత్తం 534.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,10,65,297. కేరళ : 71,18,200. కర్నాటక : 1,26,11,493. తమిళనాడు : 1,31,59,822. తెలంగాణ : 62,57,745. గుజరాత్ : 88,35,130. మహారాష్ట్ర : 1,18,71,449. రాజస్థాన్ : 48,86,577. మధ్యప్రదేశ్ : 42,22,445. ఇండియా : 15,78,05,240.