Pawan Kalyan: మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. జనసేన ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర షెడ్యూల్పై చర్చింస్తారు.

Janasena chief Pawan Kalyan
Pawan Kalyan -Varahi Yatra: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన వారాహి విజయ యాత్ర (varahi vijaya yatra) కు జనసైనికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు విడుతల్లో ఈ యాత్రను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో భాగంగా ఏపీ ప్రభుత్వం (AP Government) పై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైనా పలు ప్రశ్నలను పవన్ లేవనెత్తారు. పవన్ వ్యాఖ్యలు ఏపీలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రెండు విడతలుగా చేపట్టిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతల మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం సాగడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగింది. రెండో విడుత వారాహి విజయ యాత్ర తరువాత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. మళ్లీ మూడో విడత యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Pawan Kalyan : ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్.. మరోసారి పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఇప్పటికే రెండు విడతల్లో పూర్తయింది. జూన్ 14న కత్తిపూడి నుంచి ప్రారంభమైన మొదటి విడత యాత్ర అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను పవన్ తన మొదటి పర్యటన ద్వారా కవర్ చేశారు. ఆ తరువాత రెండో విడత వారాహి విజయ యాత్ర జూలై 9 నుంచి ఏలూరులో ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది. తాజాగా మూడో విడత వారాహి విజయ యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ప్రారంభ తేదీనిసైతం ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభ తేదీపై చర్చించనున్నారు.
Pawan Kalyan: ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులపై పడుతుందా?: పవన్
మూడో విడత వారాహి యాత్రను పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టాలా? ఉత్తరాంధ్రలో చేపట్టాలా? అనే అంశంపై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఉత్తరాంధ్ర లేక రాజమండ్రిలో మూడవ విడత వారాహీ యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు 3, 5 తేదీల్లో మూడో విడత యాత్రను ప్రారంభించేందుకు పవన్ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ రెండు తేదీల్లో ఏరోజు యాత్ర ప్రారంభమయ్యేది సోమవారం సాయంత్రం జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని జనసేన నేతలు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్గా కొనసాగింది. గోదావరి జిల్లాలను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలంటూ పవన్ తన ప్రసంగంలో ఆ ప్రాంతం ప్రజలను పదేపదే విజ్ఞప్తి చేశారు.