Pawan Kalyan Tweet : జనసైనికులు జాగ్రత్త.. హాట్ టాపిక్గా పవన్ కల్యాణ్ ట్వీట్
అప్పటివరకు తిట్టినోళ్లు ఇప్పుడెందుకు పొగొడుతున్నారో ఆలోచించాలి. ఆ నాయకుడు మారిపోయాడని చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.
Pawan Kalyan Tweet : జనసైనికులు జాగ్రత్త అంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపై చర్చ జరుగుతోంది. ఇంతకీ పవన్ ఏమని ట్వీట్ చేశారంటే.. ”ఇన్నాళ్లు తిట్టిన వాళ్లు ఇప్పుడు పొగడటం మైండ్ గేమ్ లో భాగమే అన్నారు పవన్. పొగుడుతున్న నాయకులను ఆకాశానికి ఎత్తేయ వద్దని సూచించారు.
Sajjala On Pawan : జనసేన తన పార్టీ అని మర్చిపోయినట్టున్నారు- పవన్ మూడు ఆప్షన్లపై సజ్జల
అప్పటివరకు తిట్టిన వాళ్లు ఇప్పుడెందుకు పొగొడుతున్నారో ఆలోచించాలని చెప్పారు పవన్. ఆ నాయకుడు మారిపోయాడని చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే” అంటూ జనసేనాని ట్వీట్ చేయడానికి రీజన్ ఏంటి? అని అంతా చర్చించుకుంటున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
”అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారు. అయితే ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టి, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టే. అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి.. జర భద్రం! అంటూ పవన్ ట్వీట్ చేశారు.
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022