Minister Roja : జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు- మంత్రి రోజా

పవన్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. రాజకీయాలకు పనికిరాడు. చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చూస్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు లేవని కొందరు మా పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు.

Minister Roja : జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు- మంత్రి రోజా

Minister Roja (Photo : Facebook)

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై ఫైర్ అయ్యారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా. లోకేశ్ యువగళం పాదయాత్రపై రోజా సెటైర్లు వేశారు. అసలు లోకేశ్ పాదయాత్ర చేసినట్లే లేదన్నారు. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారిని టీడీపీలోకి తీసుకోవాలని చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు అని రోజా విమర్శించారు.

”లోకేశ్ 400 రోజులు, 4వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎప్పుడు పూర్తి చేశాడో అర్థం కావడం లేదు. హైదరాబాద్, ఢిల్లీకి పారిపోయి మళ్లీ పాదయాత్ర అంటూ వచ్చాడు. నగరి పాదయాత్రలో జనాలు లేక రెండు రోజులు వేచి చూశాడు. 200 కిలోమీటర్లకు లోకేశ్ 200 బ్రేక్ లు తీసుకున్నాడు. రేపటి లోకేశ్ మీటింగ్ కు రమ్మంటే పవన్ తొలుత రాను అని చెప్పి, మళ్లీ వస్తాను అన్నారు. మీటింగ్ లకు కూడా పవన్ ప్యాకేజ్ లు తీసుకుంటున్నారు. జన సైనికులపై నాకు ఎప్పుడూ జాలి ఉంటుంది. వాళ్ళు జెండాలు మోసే కూలీలు.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

పవన్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. రాజకీయాలకు పనికిరాడు. చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చూస్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు లేవని కొందరు మా పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మా పార్టీలో టిక్కెట్లు దక్కని వారిని తమ పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. టీడీపీ, జనసేనలకు అభ్యర్థులు లేరు. జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు” అని మంత్రి రోజా అన్నారు.

అటు.. వైసీపీలో ఇంఛార్జ్ లను మారుస్తున్న అంశంపై స్పందించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీటు ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేదన్నారు రోజా. తాను జగనన్న సైనికురాలిని అన్న రోజా.. ఆయన కోసం ప్రాణమైనా ఇస్తానన్నారు. అసెంబ్లీ సీటు ఎవరికిచ్చినా పర్వాలేదన్నారు మంత్రి రోజా.

Also Read : నాకు కాకపోతే వారిద్దరికిస్తారా?.. నగరిలో పోటీపై మంత్రి రోజా ఆక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారని రోజా ప్రస్తావించారు. రోజాకు టికెట్ లేదని స్టోరీలు వేసి ఎవరైతే శునకానందం పొందాలని అనుకుంటున్నారో.. ఆ ఆనందం కొన్నిరోజుల వరకే అన్నారు. మా కార్యకర్తలకు, నాయకులకు ఎవరికీ బాధ లేదు. నాకు టికెట్ ఉందన్న నిజం నాకు, నా కార్యకర్తలకు, నా అనుచరులకు తెలుసు అని అన్నారు రోజా.