మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

శ్రీకాకుళంలోనూ.. వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయి. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

Koona Ravi Kumar

Koona Ravi Kumar : ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం తమ్మినేనికి అలవాటేనని అన్నారు. తమ్మినేని అక్రమాలపై దర్యాప్తుకోసం స్పెషల్ టీం వేయాలని సీఎంను కోరతానని కూన రవి పేర్కొన్నారు. ఆయనకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం అలవాటే. ఆ అలవాటులో భాగంగానే తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. తమ్మినేని సీతారాం ఇతర ఆస్తుల పైనా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారు. సుమారు 17 ఆస్తులపై డమ్మాబుస్సుల సీతారాం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడని కూన రవికుమార్ ఆరోపించారు.

Also Read : తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. మోసగాళ్ల బారిన పడ్డ శ్రీవారి భక్తులు

శ్రీకాకుళంలోనూ.. వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయి. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ మిషన్ల ద్వారా తమ్మినేని ఫేక్ వోచర్లు పుట్టించారు. నకిలీ మిషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇసుక అక్రమాలపై ఇప్పటికే ఫిర్యాదు చేశాను. డమ్మాబుస్సుల సీతారాంపై నేరాలు – ఘెరాలు అనే ఎపిసోడ్ తీయొచ్చు అంటూ కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. రెవెన్యూ సదస్సుల్లో సీతారాం ఫేక్ రెవెన్యూ డాక్యుమెంట్లపై ఫిర్యాదులు వస్తే వాటి మీద చర్యలు తీసుకుంటాం. తమ్మినేని సీతారాం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూన రవికుమార్ పేర్కొన్నారు.

Also Read : మూడు వారాలు టైమ్ ఇస్తున్నాం.. అవసరమైతే నేనే వచ్చి ధర్నాచేస్తా : వైఎస్ జగన్

తమ్మినేని సీతారాం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలోనే నాటి స్పీకర్ తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ద్వారా లా అడ్మిషన్ తీసుకున్నారు. నాటి సీఎం జగన్ దీన్ని పట్టించుకోలేదు. డిగ్రీ చేసినట్టు అంబేద్కర్ యూనివర్శిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఓ లా కాలేజీ నుంచి అడ్మిషన్ తీసుకున్నారు. తమ్మినేని ఫేక్ వ్యవహారాన్ని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్శిటీలు రెండూ ధృవీకరించాయి. తమ్మినేని ఫేక్ వ్యవహరంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాను. తమ్మినేని మీద సీఎస్ కు ఫిర్యాదు చేయాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి నాకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐడీతో విచారణ చేయించాలని సీఎస్ కు ఫిర్యాదు చేశాను. తమ్మినేని ఫేక్ వ్యవహరం రెండు రాష్ట్రాలకు చెందిన అంశం.. అందుకే సీఐడీతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. త్వరలోనే సీఐడీ చీఫ్ అయ్యన్నార్ ను కలిసి కంప్లైంట్ చేస్తాను. స్పీకర్ గా వ్యవహరించిన వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తే ఊపేక్షించకూడదు. సీఎస్, సీఐడీ విచారణ చేపట్టకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూన రవికుమార్ పేర్కొన్నారు.