TDP: టీడీపీలో చేరిన వైసీపీ హిందూపురం కీలక నేత
హిందూపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని రోజులుగా..
ఎన్నికల వేళ వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. అమరావతిలో టీడీపీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవలే వైసీపీకి ఇక్బాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన హిందూపురానికి చెందిన నేత.
గతంలో ఐపీఎస్ అధికారిగా కొనసాగిన ఇక్బాల్ చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గానూ పనిచేశారు. అనంతరం టీడీపీలో చేరారు. కొన్నేళ్ల తర్వాత వైసీపీ కండువా కప్పుకుని ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఇక్బాల్ హిందూపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు.
టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఇక్బాల్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జగన్ కు, శాసన మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఆయన ధైర్యాన్ని నింపుతారు.. ఆశీర్వాదం తీసుకున్నాం: మంత్రి పొన్నం