Nagarjuna sagar project dispute: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలు

ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.

Nagarjuna sagar project dispute: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలు

Nagarjuna sagar project dispute

నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ (కుడి) కెనాల్ కి తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందే అడగకుండా నీటిని  ఎలా విడుదల చేస్తారని కేఆర్ఎం బీ ప్రశ్నించింది. ఇరువర్గాల మధ్య వివాదాన్ని తెరదించాలని కోరింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదంది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం కుదిరిందని తెలిపింది.

మూడు దశల్లో నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 10 నుండి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుండి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుండి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునే విధంగా రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉందని బోర్డు తెలిపింది. ముందే అడగకుండా నవంబర్ లో నీటిని ఎలా విడుదల చేస్తారని కేఆర్ ఎంబీ ప్రశ్నించింది. కాగా, అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు బోర్డు పేర్కొంది. ఇక వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ లో నీటిని విడుదల చేయాల్సి ఉందని బోర్డు తెలిపింది.

Also Read : మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు

ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది. తెలంగాణవైపు పోలీసు బలగాలు పెంచుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు తాజా వివాదంతో ఇరిగేషన్ అధికారులతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు సమావేశం అయ్యే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని కేంద్ర అధికారులను, కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ అధికారులను తెలంగాణ ఆఫీసర్స్ కోరుతున్నారు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

Also Read : నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం .. కేంద్రం ఆరా..