ఏపీలో కొత్త లాక్ డౌన్ మార్గదర్శకాలు, జూన్ 8 నుంచి అమల్లోకి

కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5 అమల్లోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ 5 అమల్లో ఉంటుంది.

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 12:25 PM IST
ఏపీలో కొత్త లాక్ డౌన్ మార్గదర్శకాలు, జూన్ 8 నుంచి అమల్లోకి

Updated On : June 6, 2020 / 12:25 PM IST

కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5 అమల్లోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ 5 అమల్లో ఉంటుంది.

కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5 అమల్లోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ 5 అమల్లో ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో లాక్ డౌన్ 5 ను పొడిగించిన విషయం విదితమే. ఈ మేరకు కేంద్రం సడలింపులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 8 నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది.

కొత్త గైడ్ లైన్స్ ఇవే:
* కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. 
* ఆహారం పార్సిల్ తీసుకెళ్లేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
*  65ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు.
* కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.
* షాపింగ్ మాల్స్ లో ఎయిర్ కండీషన్ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
* అనుమతి ఉన్న షాంపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
* షాపింగ్ మాల్స్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
* ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
* హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి.
* గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసి ఉంచాలి.
* షాపింగ్ మాల్స్ లోని సినిమా హాళ్లు తెరవకూడదు.

దేవాలయాల్లో పాటించాల్సినవి:
* దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలకు అనుమతి.
* ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై కొనసాగనున్న నిషేధం.
* దేవాలయాల దగ్గర క్యూ మేనేజ్ మెంట్ సవ్యంగా ఉండాలి.
* దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకోవాలి.
* తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధం.
* సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
* ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కిందకూర్చునే వస్త్రం లేదా తివాచీని తెచ్చుకోవాలి.