Road Accident : ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో నలుగురు మరణించారు.

Road Accident
Road Accident in Eluru District : ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ లో తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కారు విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read : IND vs ZIM : జింబాబ్వేపై విజయం తరువాత శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.