TDP : 14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల, బాలకృష్ణ, షరీఫ్, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.

TDP Political Action Committee
TDP Political Action Committee : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం అయింది. 14 మంది సభ్యులతో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఆదివారం కమిటీ సభ్యుల పేర్లను విడుదల చేశారు. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల, బాలకృష్ణ, షరీఫ్, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, కాలవ శ్రీనివాసులు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, టీడీపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.
Nara Brahmani : బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు .. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు
మరోవైపు పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని ఖండించారు. లోకేష్ యువగళం పున: ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు.
Buddha Venkanna : ఉండవల్లికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టాయి : బుద్దా వెంకన్న
చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ..ఇటు యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు. మరోవైపు బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశం అయ్యారు.