Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్ను ఇన్నోవా ఢీకొంది.
road accident at Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్ను ఇన్నోవా డీకొంది. ఈ ప్రమాదంలో రిపోర్టర్ సుధాకర్గౌడ్, వైసీపీ నేత ముడియాల శ్రీనివాసరెడ్డి, శివలింగం స్పాట్లోనే మృతి చెందారు.
బెంగళూరుకు వెళ్లివస్తుండగాప్రమాదం బారినపడ్డారు వాహనంలో ప్రయాణిస్తున్నవారు. టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పిన ఇన్నోవా డివైడర్ మీదుగా అవతలి వైపు దూసుకుపోయింది.
అటుగా వస్తున్న కంటైనర్ను ఢీకొనడంతో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఖాజాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.