ఎన్నికల వేళ ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి: సీఎం జగన్

YS Jagan: లారీ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారని చంద్రబాబు నాయుడు హేళన చేశారని జగన్ చెప్పారు.

ఎన్నికల వేళ ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి: సీఎం జగన్

CM-Jagan

‘ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి.. ఈ ఎన్నికలే మీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అక్కాచెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయని చెప్పారు.

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని పెంచికలపాడు దగ్గర నుంచి ఇవాళ జగన్ ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఎమ్మిగనూరు సహా పలు ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ‎నే అని అన్నారు.

లారీ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారని చంద్రబాబు నాయుడు హేళన చేశారని జగన్ చెప్పారు. ప్రజా వ్యతిరేక పార్టీలకు సమాధి కట్టాలని అన్నారు. బాబు తోకను, తోకలను కత్తిరించాలని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వానికి రాఖీ కట్టాలని అన్నారు.

పేదల సంక్షేమం కోసం వైసీపీని గెలిపించాలని జగన్ కోరారు. ఈ ఐదేళ్లు పేదలకు మంచి జరిగిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారని అన్నారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని చెప్పారు. పొత్తులను, జిత్తులను ఎదుర్కుంటానని తెలిపారు.

Also Read: ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది.. అది ముగియగానే..: రేవంత్ రెడ్డి